ఎంపీ విజయసాయికి 'సన్ సద్ రత్న' అవార్డు

1824చూసినవారు
ఎంపీ విజయసాయికి 'సన్ సద్ రత్న' అవార్డు
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి 2023 ఏడాదికి ‘సన్ సద్ రత్న’(పార్లమెంటరీ రత్న) అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ తరఫున రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అద్యక్షత వహిస్తున్నారు. ఈ ఏడాదికి 13 మంది ఎంపీలతో పాటు 2 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు, 1 లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను కేంద్రం ప్రకటించింది.