తక్కువ మార్కులు వచ్చాయని స్కూల్ నుంచి 40 కి.మీ. దూరం పారిపోయిన ఇద్దరు నోయిడా విద్యార్థులు (వీడియో)

62చూసినవారు
ఇద్దరు విద్యార్థులకు మార్కులు తక్కువగా రావడంతో వారి తల్లిదండ్రులను స్కూల్‌లో మాట్లాడేందుకు తీసుకురావాలని టీచర్లు చెప్పడంతో నోయిడాలోని పాఠశాల నుంచి పారిపోయారు. వారి ఆచూకీ కోసం పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి గాలించారు. 500కు పైగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. మఫ్టీలోనూ వెళ్లి వెతికారు. చివరకు ఆ బాలురు స్కూల్ నుంచి 40 కిమీ దూరంలో ఉన్న ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో దొరికారు.

సంబంధిత పోస్ట్