బంగ్లాదేశ్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల వల్ల దాదాపు 45 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని పలు అధ్యయనాలు తెలిపాయి. అలాగే 15 మంది చనిపోయారని పేర్కొన్నాయి. కాగా 'మూడు దశాబ్దాల్లో మనం చూసిన అత్యంత దారుణమైన వరదలు ఇవే" అని BRAC అనే ఎన్జీఓ తెలిపింది. దీంతో స్వచ్ఛంద సంస్థలను సహాయక చర్యల్లో పాల్గొనాలని తాత్కాలిక ప్రభుత్వం కోరింది.