అమెరికా 104 మంది భారతీయులను వెనక్కి పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా బహిష్కరణ తుది జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగశాఖ(MEA) వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం భారత్కు తెలియజేసినట్లు పేర్కొంది. వలసదారులను సంకెళ్లు వేసి తరలిస్తున్నారని వస్తోన్న ఆరోపణలపై స్పందిస్తూ.. అమెరికా వద్ద తమ ఆందోళన తెలియజేశామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.