యూపీలోని మీరట్ జిల్లా ఇంచోలిలోని దారుణం జరిగింది. ధన్పూర్ గ్రామానికి చెందిన కానిస్టేబుల్ గోపాల్ యాదవ్ కుమారుడు పునీత్ యాదవ్ (6)ని దుండగులు రూ. 50 లక్షల రూపాయల కోసం కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వాలని అడిగారు. దానికి తండ్రి గోపాల్ నిరాకరించాడు. దీంతో దుండగులు బాలుడిని హత్య చేసి కాళ్లు, చేతులు కట్టేసి పొలాల్లో పడేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.