హజ్ యాత్రలో మృతి చెందిన వారిలో 68 మంది భారతీయులు!

84చూసినవారు
హజ్ యాత్రలో మృతి చెందిన వారిలో 68 మంది భారతీయులు!
ఈ ఏడాది హజ్ యాత్రలో 68 మంది భారతీయులు సహా 600 మందికి పైగా మరణించారని సౌదీ అరేబియా దౌత్యవేత్త బుధవారం వెల్లడించారు. భారత్ నుంచి వచ్చిన వారిలో 68 మంది మృతి చెందినట్లు గుర్తించారు. వీరిలో కొందరు సహజంగా మరణించారని, మరికొందరు వృద్ధాప్యం కారణంగా మరణించారని వెల్లడించారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో వేడిని తట్టుకోలేక 550 మందికి పైగా మృతి చెందినట్లు మంగళవారం అరబ్ ప్రతినిధులు తెలిపారు.

సంబంధిత పోస్ట్