యూపీలోని బులంద్షహర్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. నరోరా గంగా ఘాట్ నుంచి 8 అడుగుల మొసలి రోడ్డుపైకి రావడంతో తీవ్ర కలకలం సృష్టించింది. మొసలిని చూసేందుకు గ్రామస్తులు గుమికూడారు. స్నానానికి వచ్చిన భక్తుల్లో భయానక వాతావరణం నెలకొంది. స్థానికులు అటవీశాఖవారికి సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకుని మొసలిని ఘాట్ లోకి వదిలేశారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.