రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ట్రాఫిక్లో రెడ్ సిగ్నల్ పడింది. అదే సమయంలో ఇద్దరు చిన్నారులు రోడ్డు దాటేందుకు యత్నించారు. అయితే ఓ ట్రక్కు డ్రైవర్ రెడ్ సిగ్నల్ను పట్టించుకోలేదు. తన వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న 8 ఏళ్ల బాలుడిని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో బాలుడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.