కూలీకి దొరికిన రూ.80 లక్షల వజ్రం

71చూసినవారు
కూలీకి దొరికిన రూ.80 లక్షల వజ్రం
మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో రాజు గౌడ్‌ అనే కూలీకి అదృష్టం వరించింది. జీవనోపాధి కోసం గనులను కౌలుకు తీసుకునే రాజు ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం కూడా మట్టిని తవ్వుతున్నారు. ఆ సమయంలో ఆయనకు 19.22 క్యారట్ల వజ్రం కనిపించింది. వెంటనే దానిని ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. ప్రభుత్వ వేలంలో దీని ధర రూ.80 లక్షలకుపైగా రావొచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ వజ్రాన్ని అమ్మగా వచ్చే సొమ్ముతో తన పిల్లలను చదివిస్తానని రాజు చెప్పారు.

సంబంధిత పోస్ట్