అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశం

75చూసినవారు
అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశం
విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. గురువారం సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టును రెండు ఫేజుల్లో చేపడతామని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సీఎంకు వివరించారు. ఫేజ్-1 మెట్రో పనులను నాలుగేళ్లలోపు పూర్తి చేయాలని సీఎం సూచించారు.

సంబంధిత పోస్ట్