ఒకేరోజు 85 వేల పండ్ల మొక్కలు.. ప్రపంచ రికార్డు

68చూసినవారు
ఒకేరోజు 85 వేల పండ్ల మొక్కలు.. ప్రపంచ రికార్డు
ఛత్తీస్‌ఘడ్‌లోని గరియాబంద్ జిల్లాలో 17 వేల మంది మహిళలు ఒకేరోజులో 85 వేల పండ్ల మొక్కలను నాటడం ద్వారా రికార్డ్ సృష్టించారు. ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ పేరుతో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు కొత్తగా పెళ్లయిన వారు, గర్భిణులు, తల్లులు పాల్గొన్నారు. వీరి ఘనతను ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది.

సంబంధిత పోస్ట్