ఎన్నికల వేళ తనిఖీల్లో రూ.8,889 కోట్లు సీజ్

60చూసినవారు
ఎన్నికల వేళ తనిఖీల్లో రూ.8,889 కోట్లు సీజ్
సార్వత్రిక ఎన్నికల వేళ నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు, డ్రగ్స్, మద్యంతోపాటు ఉచిత పంపిణీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటి మొత్తం విలువ రూ.8,889 కోట్లు ఉంటుందని తెలిపింది. అయితే ఎక్కువగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు స్పష్టం చేసింది. రూ.3,959 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడిందని వివరించింది. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్