సీబీఎస్ఈ ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. పదో తరగతిలో 93.6 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. అబ్బాయిల కన్నా 2.04 శాతం మంది అధికంగా అమ్మాయిలే పాసయ్యారు. పదో తరగతి పరీక్షల్లో అమ్మాయిలు 94.75 శాతం మంది పాసైనట్లు ప్రకటనలో తెలిపారు. సుమారు 47 వేల మంది విద్యార్థులు.. 95 శాతం కన్నా ఎక్కువ మార్కులను సాధించారు. సుమారు 2.12 లక్షల మంది 90 శాతం కన్నా ఎక్కువ మార్కులతో పాసయ్యారు.