వయసులో పెద్దదైన మహిళతో సహజీవనం చేస్తున్న ఒక వ్యక్తి..అనుమానంతో ఆమెను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. వినీత(50) అనే మహిళా భర్త మరణించాడు. దీంతో మూడేళ్ల నుంచి గౌతమ్(35)తో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే మరి కొందరితో వినీతకు సంబంధాలు ఉన్నట్లు గౌతమ్ అనుమానించాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో గౌతమ్ వినీతను కొట్టి చంపాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.