నైలు నదిలో మునిగిన బోటు.. 19 మంది కూలీలు మృతి

69చూసినవారు
నైలు నదిలో మునిగిన బోటు.. 19 మంది కూలీలు మృతి
ఈజిప్టు రాజధాని కైరో శివారులో నైలునదిలో ఓ ఫెర్రీ బోటు మునిగిపోవడంతో 19 మంది కూలీలు మరణించారు. గ్రేటర్‌ కైరోలో భాగమైన గిజాలోని మోన్షాత్‌ ఎల్‌ కాంటేర్‌ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. పడవ ప్రమాదానికి కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఈజిప్టు పౌండ్లు, క్షతగాత్రులకు 20 వేల పౌండ్ల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్