ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికుల పైకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి

83చూసినవారు
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికుల పైకి దూసుకెళ్లిన కారు..ఇద్దరు మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున వైద్య విద్యార్థుల బృందం నడుపుతున్న కారు ఫుట్‌పాత్‌ పై నిద్రిస్తున్న కార్మికుల మీదికి దూసుకెళ్లింది. దీంతో ఒక బాలుడితో సహా ఇద్దరు మరణించారు. అలాగే ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. కారులోని వ్యక్తులు పుట్టినరోజు వేడుకకు వెళ్ళి వస్తుండగా దిఘోరి నాకా సమీపంలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్