దేశంలోని 40 ఎయిర్పోర్ట్లకు బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ పోర్ట్ లను పేల్చేస్తామంటూ దుండగుల నుంచి బెదిరింపు మెయిల్ వచ్చాయి. దీంతో విమానాశ్రయాల్లో బాంబ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. మంగళవారం మధ్యాహ్నం 12.40 గంటల ప్రాంతంలో భారతదేశంలోని 40 విమానాశ్రయాలకు గుర్తు తెలియని వ్యక్తి ఇదే బాంబు బెదిరింపు ఇమెయిల్ను పంపినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.