న్యూజిలాండ్-టీమిండియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సరిగా ఆడలేదని మనస్థాపం చెంది పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గర్గుల్ గ్రామానికి చెందిన క్రికెట్ ప్రేమికుడు పల్లపు శరత్ కుమార్ (16) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శరత్ ఇటీవల జిల్లా జట్టు తరఫున U-16లో ఆడి గెలుపొంది వచ్చాడు. కాగా, CT ఫైనల్లో కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యారు.