ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమేమని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. రైతన్నల సమస్యలపై సీఎం వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. 'రైతన్నలపైన లాఠీ చార్జ్ చేసిన అధికారులపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలి. రైతన్నలపై ప్రభుత్వ దాడులు BRS ఊరుకోదు. అవసరమైతే పార్టీ తరఫున విస్తృతమైన నిరసన కార్యక్రమాలకు పిలునిస్తాం' అని హెచ్చరించారు.