రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు మారింది. ఈ కేసు విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మరికొంత మంది అరెస్ట్కు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.