అసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మాణిక్యపూర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పొలానికి వెళ్లిన ఆత్రం తిరుపతి అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అయితే భూ వివాదమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకుకున్న డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరిస్తున్నారు.