అయోధ్యలో రామాలయాన్ని ఈనెల 22న ఓపెన్ చేయనున్న విషయం తెలిసిందే. ఆ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానం అందిందని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని
కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలను ఆయన వ్యతిరేకించారు. నియంతృత్వ సంకేతాలన్నారు. ఈ సందర్భంగా భారత్ జోడో న్యాయ యాత్రకు చెందిన లోగోను, నినాదాన్ని ఆయన ఆవిష్కరించారు.