అందుకే భారత్ జోడో న్యాయ యాత్ర: ఖర్గే

79చూసినవారు
అందుకే భారత్ జోడో న్యాయ యాత్ర: ఖర్గే
ప్రజా సమస్యలపై మరో మార్గం లేకనే తాము యాత్ర ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పార్లమెంట్‌లో సమస్యలను లేవనెత్తేందుకు ప్రయత్నించాం. కానీ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు’’ అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్