జగన్ సినిమా అయిపోయిందని.. మళ్లీ గెలిచే అవకాశమే లేదని
టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.
వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టడానికే ‘కదిలి రా’ కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు దగాపడ్డారని..
టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. జగన్ పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.