అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సోమవారం జరిగింది. ఆ ప్రాణప్రతిష్ఠ సమయంలో ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ కు చెందిన ఫర్జానా అనే మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ ముస్లిం దంపతులు వారికి పుట్టిన బిడ్డకు రాముడి పేరు వచ్చేలా ‘రామ్ రహీమ్’ అని నామకరణం చేశారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠ ముహూర్త సమయంలోనే తనకు నార్మల్ డెలివరీ కావడంతో తమ బిడ్డకు రాముడి పేరు పెట్టుకున్నట్లు ఫర్జాన చెప్పింది.