హైటెన్షన్ విద్యుత్ లైన్‌ తాకి వ్యక్తి మృతి.. వీడియో

62చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం జరగగా.. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు ఒక పెద్ద ఇనుప నిచ్చెనను తీసుకువెళ్తుండగా.. అది హైటెన్షన్‌ విద్యుత్ లైన్ కు తగిలింది. దీంతో నిచ్చెనకు కరెంట్ సరఫరా కావడంతో రాజు అనే వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. నందకిషోర్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్