రాజస్థాన్లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఆ ఫోన్ ట్యాపింగ్తో పాటు రీట్ (రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాల్లో.. మాజీ సీఎం గెహ్లాట్పై ఆయన మాజీ ఓఎస్డీ లోకేష్ శర్మ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో గెహ్లాట్ తనకు కొందరు మంత్రుల ఆడియో క్లిప్స్తో కూడిన ఓ పెన్డ్రైవ్ ఇచ్చారని, వాటిని మీడియాకు లీక్ చేయమని చెప్పారంటూ కుండబద్దలు కొట్టారు