ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఓరయాలోని అజిత్మాల్ భిఖేపూర్ ఓవర్బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది బస్సు ప్రయాణికులు గాయపడ్డారు. వీరంతా కాన్పూర్ నుంచి ఆగ్రా వివాహ వేడుకకు వెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను సీహెచ్సీకి తరలించారు.