ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న బిహార్ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. ఆ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 5 వేల హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్కు ఆర్థికసాయం ప్రకటించారు. ఐఐటీ పట్నా సామర్థ్యాన్ని మరింత పెంచనున్నారు. బిహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి వరాలివ్వలేదు.