తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. మాక్లూరు మండలం ధర్మోరాలో ఓ సవతి తండ్రి నాలుగేళ్ల చిన్నారిని గొంతు నులిమి చంపాడు. గ్రామానికి చెందిన అరుణ్ తన రెండో భార్య కుమార్తె లక్కీ (4)ని గొంతు నులిమి చంపేశాడు. మొదటి భర్తకు పుట్టిన పాప ఉండొద్దని అరుణ్ తరచూ సునీతతో గొడవ పడేవాడు. గతంలోనూ కోపంతో నిందితుడు ఆ చిన్నారి చేయి విరగొట్టాడు.