బ్లడ్క్యాన్సర్తో బాధపడుతున్న ఢిల్లీకి చెందిన ఓ ఐదేళ్ల బాలుడిని కాపాడాలని తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యులను సంప్రదించారు. కానీ, అతడి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో డాక్టర్లు చేతులెత్తేశారు. బాలుడిని గంగలో ముంచితే రోగం నయమవుతుందని హరిద్వార్కు వెళ్లారు. ఒకవైపు తల్లిదండ్రులు ప్రార్థనలు చేస్తుండగా.. మరోవైపు ఆ బాలుడిని, అతడి అత్త చల్లగా ఉన్న గంగానదిలో ముంచింది. ఎంతకీ బాలుడిని బయటకు తీయకపోవడంతో అతడు మృతిచెందాడు.