రూ.600 కోట్ల విలువైన వజ్ర వినాయక విగ్రహాన్ని ఏడాదికోసారి భక్తులకు చూపిస్తోన్న సూరత్ వ్యాపారి

70చూసినవారు
రూ.600 కోట్ల విలువైన వజ్ర వినాయక విగ్రహాన్ని ఏడాదికోసారి భక్తులకు చూపిస్తోన్న సూరత్ వ్యాపారి
గుజరాత్ లోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి కను అసోదరియా వద్ద సహజంగా లభించిన వజ్ర వినాయక విగ్రహం ఉంది. 12 ఏళ్ల క్రితం బెల్జియం నుంచి తీసుకొచ్చిన ఈ వజ్రం కోహినూర్ వజ్రం (105 క్యారెట్లు) కంటే పెద్దది. ఇది 182.3 క్యారెట్లు, 36.5 గ్రాముల బరువు ఉంది. మార్కెట్లో దీని ధర రూ.600 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ వజ్రపు విగ్రహాన్ని ఏడాదికి ఒకసారి వినాయక చవితి రోజున మాత్రమే పూజించడంతో భక్తులకు దర్శించుకునే భాగ్యం కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్