ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది మృతి

50చూసినవారు
ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు 200 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో సుమారు 30 మంది మరణించారని సమాచారం. ఈ ప్రమాదం జరిగినప్పుడు 50 నుంచి 55 మంది బస్సులో ఉన్నారు. బస్సు హరిద్వార్ జిల్లాలోని లాల్‌ధంగ్ నుంచి పౌడిలోని బిరోంఖల్‌కు వెళ్తోంది. వధువు ఇంటికి మరో రెండు కిలోమీటర్లు ఉందనగా, బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో లోయలో పడిపోయింది.

సంబంధిత పోస్ట్