గుజరాత్లో దారుణ ఘటన వెలుగు చూసింది. కచ్ జిల్లా రాపర్ తాలూకాలోని బేలా గ్రామానికి చెందిన ప్రవీణ్ నమారి రాథోడ్ (13) అనే బాలుడిని నిందితులు కత్తితో మెడపై, పొత్తి కడపులో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఓ తోటలో బాలుడి మృతదేహం కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ గేమ్ విషయంలో గొడవ పడి ముగ్గురు మైనర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. హత్యకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.