కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆదోని మండలం కుప్పగల్కు చెందిన పూజారి ఈరన్న, ఆదిలక్ష్మి దంపతులు కూడా మరణించారు. చిన్నారి సుస్మితను ఇంట్లోనే వదిలిపెట్టి బైక్పై ఆసుపత్రికి వెళ్లిన ఇద్దరిని బస్సు కబళించింది. అయితే అమ్మానాన్న ఇక రారని తెలుసుకోలేని చిన్నారి.. అమ్మానాన్న ఎక్కడ అని అడుగుతుండడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.