అందరూ చూస్తుండగానే ఎద్దును లాక్కెళ్లిన పులి (వీడియో)

1935చూసినవారు
ఓ పులి అకస్మాత్తుగా దాడి చేసి ఓ ఎద్దును లాక్కుపోయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిగింది. శుక్రవారం జంగిల్ సఫారీ మార్గంలో ఒక పులి అకస్మాత్తుగా కనిపించడంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో రోడ్డుపై తిరుగుతున్న ఎద్దుపై పులి దాడి చేసి ఎద్దును పట్టుకుని అడవిలోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన మొత్తాన్ని ప్రజలు తమ కెమెరాల్లో బంధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్