సికింద్రాబాద్లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. శామీర్పేట్ తూముకుంటలో రవీందర్, సరళ దంపతులు నివాసం ఉంటున్నారు. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన భార్యాభర్తలు ఆస్పత్రికి వస్తున్న క్రమంలో ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలి ఇరువురిపై పడింది. ఈ ప్రమాదంలో రవీందర్ అక్కడికక్కడే మృతిచెందగా, భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.