దంపతులపై విరిగిపడిన చెట్టు.. భర్త మృతి (వీడియో)

31781చూసినవారు
సికింద్రాబాద్‌లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. శామీర్‌పేట్‌ తూముకుంటలో రవీందర్, సరళ దంపతులు నివాసం ఉంటున్నారు. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన భార్యాభర్తలు ఆస్పత్రికి వస్తున్న క్ర‌మంలో ద్వారం వద్ద ఉన్న ఓ చెట్టు కూలి ఇరువురిపై ప‌డింది. ఈ ప్ర‌మాదంలో రవీందర్ అక్కడికక్కడే మృతిచెందగా, భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్