ఐపీఎల్ టికెట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని, క్రికెట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. ఈ మేరకు ఆ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘ఇవాళ ఉప్పల్ స్టేడియంలో SRH-RCB మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు ఉన్నాయంటూ ఫేక్ రీల్స్, స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ లింక్లపై అసలు క్లిక్ చేయొద్దు’ అని కోరారు.