లోక్సభ ఎన్నికలకు ముందు మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్తో ఢిల్లీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ కేసులో కేజ్రీవాల్కు స్థానిక రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 15వ తేదీ వరకూ జుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కేజ్రీవాల్ ఇంటికి క్యూ కట్టారు. అక్కడ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్తో సమావేశం కానున్నారు.