ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆప్

78చూసినవారు
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆప్
రెండు రాష్ట్రాల్లో అధికారం, పలు రాష్ట్రాల్లో ఉనికిని చాటుకుని జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని డీడీయూ మార్గ్‌లోని ఆప్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రచారాన్ని పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్