భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరి టీ20లో భారత్ జట్టు 150 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (135) సెంచరీతో కదం తొక్కాడు. అయితే అభిషేక్ శర్మ ఇన్నింగ్స్లో 7 బౌండరీలు (28 పరుగులు), 13 సిక్స్లు (78 పరుగులు) కొట్టాడు. ఈ బౌండరీల ద్వారానే అభిషేక్ 106 పరుగులు సాధించాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ బౌండరీలతోనే సెంచరీ బాదావ్ కదా అభిషేక్ అని కామెంట్స్ చేస్తున్నారు.