అనాథ పిల్లలకు దత్తత తీసుకోవాలనుకునేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సీనియారిటీ ప్రకారం వారికి దగ్గర ఉండే ప్రత్యేక దత్తత కేంద్రం నుంచి ఆన్లైన్, ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు. అక్కడ ఉండే పిల్లలను చూపిస్తారు. వారికి పిలుపువచ్చిన 48 గంటలలోపు ప్రక్రియ పూర్తి చేసి వారికి పిల్లలను అప్పజెప్తారు. ఐసీడీఎస్ అధికారులు సంప్రదించినా పూర్తి వివరాలు తెలియజేస్తారు.