ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!

58చూసినవారు
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!
ముంబై అల్లర్ల కేసులో తప్పించుకు తిరుగుతున్న ఓ నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..1993లో ముంబైలో అలర్లు చెలరేగాయి. ఆ సమయంలో నగరంలో చట్టవిరుద్ధంగా జనాలను పోగు చేసిన కేసుతో పాటు ఓ హత్య ఘటనలో సయ్యద్‌ నాదిర్‌ షా అబ్బాస్‌ ఖాన్‌ (65) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన అతడు..అప్పటినుంచి కనిపించకుండా పోయాడు.

సంబంధిత పోస్ట్