అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు

52చూసినవారు
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు
పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం హెచ్చరించారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న అంశంపై ఫిర్యాదులు అందుతున్నాయని, అందుకే ఐదుగురు మెంబర్స్ తో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి పాఠశాల ఎదుట ఫీజు డిస్ ప్లే బోర్డును ఏర్పాటుచేయాలని ఆయన ఇటీవల స్పష్టంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం వల్ల విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జరిగే లబ్ధి గురించి వివరిస్తామని బుర్ర వెంకటేశం వివరించారు.

సంబంధిత పోస్ట్