నటుడు పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ అనుచిత వ్యాఖ్యలు చేయగా అవి వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండ్రోజులుగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తోందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్కాల్స్, మెస్సేజ్లతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు.