అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్.. ఏడాదిన్నర క్రితం స్టాక్ మార్కెట్లో దుమ్మురేపింది. ఆ సమయంలో తీవ్ర ఆరోపణలతో హిండెన్బర్గ్ నివేదిక వెలువడింది. అంతే ఒక్కసారిగా ఆ స్టాక్ కుప్పకూలింది. అలాంటి స్టాక్ విలువ మళ్లీ పూర్వస్థాయికి చేరింది. శుక్రవారం ఆ కంపెనీ షేరు రాణించడంతో ఇంట్రాడేలో రూ.3,449 వద్ద నాటి విలువను అందుకుంది. అమెరికా బ్రోకరేజీ సంస్థల మద్దతు, జీక్యూజీ పార్ట్నర్స్ పెట్టుడులు సంస్థను ఒడ్డుకు చేర్చాయి.