నేడు విడుదలైన పదవతరగతి పరీక్ష ఫలితాలలో ఉమ్మడి అదిలాబాద్ ఆశ్రమ పాఠశాలలో 50 ఆశ్రమ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఇదే మాదిరిగా వచ్చే విద్యా సంవత్సరం లో ఉమ్మడి అదిలాబాద్ ఆశ్రమ పాఠశాలలు అన్నీ వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా, నాణ్యమైన విద్యను అందించేలా, ప్రతీ ఆశ్రమ పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు