జూన్లో జరగనున్న టీ-20 వరల్డ్ కప్కు భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అయితే, టీమిండియా వరల్డ్ కప్లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం హాట్ టాపిక్గా మారింది. స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, సీనియర్ పేసర్ మహ్మద్ షమీలకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మహ్మద్ షమీ, ప్రస్తుతం ఐపీఎల్లో నిలకడగా ఆడుతున్న రాహుల్కి చోటు దక్కకపోవడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.