ఆదిలాబాద్ టూటౌన్ పోలీసు స్టేషన్లో
పలువురు సిపిఐ నాయకులపై కేసు నమోదైంది. ఎస్ఐ లాల్ సింగ్ తెలిపిన వివరాల మేరకు. సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, నాయకులతో కలిసి పట్టణంలోని గాంధీనగర్ లో ఉన్న బుద్ధవిహార్ లోకి బుధవారం వెళ్లి పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. ఇలా ఎందుకు ఏర్పాటుచేశారని దావుని శోభ వారిని ప్రశ్నించగా వారు ఆమెను దూషిస్తూ బెదిరించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.