ఈ నెల 22న టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్కు రాబోతున్నారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. బోథ్, ఆదిలాబాద్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జీలు గజేందర్, కంది శ్రీనివాసరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ లక్ష్యం ఒక్కటేనని ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడమేననని స్పష్టం చేశారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణపై కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు.